నా పేరుతో ఫేక్ లెటర్.. టీడీపీ కార్యకర్తలెవ్వరూ నమ్మొద్దు : అచ్చెన్నాయుడు

-

ఆంధప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని స్కిల్‌ డెవలెప్‌మెంట్ కేసులో అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఏపీలో టీడీపీ కేడర్ నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. బాబుతో నేను అంటూ ఓ క్యాంపెయిన్ ని ప్రారంభించింది. ఈ క్రమంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరుతో ఓ ప్రెస్‌నోట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ నోట్‌లో టీడీపీ నిరసన కార్యక్రమాల్లో పాల్గొని నేతలపై చర్యలు తీసుకుంటామన్నట్లుగా హెచ్చరించినట్లు ఉంది.

అయితే ఈ నోట్ ఫేక్ అంటూ అచ్చెన్నాయుడు క్లారిటీ ఇచ్చారు.రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబునాయుడుకు మద్దతుగా వేలాదిమంది స్వచ్చందంగా పాల్గొంటున్న నిరసన కార్యక్రమాలు చూసి ఓర్వలేక వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా విభాగం తప్పుడు ప్రచారానికి తెరలేపింది. నా పేరుతో పార్టీ అనుబంధ విభాగాలను హెచ్చరిస్తూ ఒక ఫేక్ లెటర్ ను విడుదల చేసి ప్రజలను, పార్టీ కేడర్ ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోంది. పార్టీ అనుబంధ విభాగాలన్నీ ప్రతి జిల్లాలో క్రియాశీలకంగా చంద్రబాబుగారికి మద్దతుగా అనేక కార్యక్రమాలు చేపడతున్నాయి. కావున దయచేసి ఎవరూ ఈ తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కోరుతున్నాను’ అంటూ ప్రెస్‌నోట్ విడుదల చేశారు అచ్చెన్నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news