BREAKING : కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

-

 

ఏపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఏకంగా 7 మంది మృతి చెందారు. కొండాపురం మండలం చిత్రావతి బ్రిడ్జి సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం..చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

తిరుమల నుండి తాడిపత్రికి వెళుతున్న తుఫాను వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. దీంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక మృతులు తాడిపత్రి వాసులుగా గుర్తించారు పోలీసులు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మొత్తం వాహనంలో 11 మంది ప్రయాణిస్తుండగా, ఏకంగా 7 మంది మృతి చెందారు.

Read more RELATED
Recommended to you

Latest news