వైసీపీలోకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ?

-

వైసీపీ పార్టీలోకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వెళుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ పార్టీ ఎమ్మెల్యేపై ప్రశంసలు కురిపించారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. దీంతో వైసీపీ పార్టీలోకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వెళుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే.. దీనిపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి గారిని మా పూర్వ విద్యార్థుల కార్యక్రమానికి ఆహ్వానించడానికి కలిశానన్నారు.

Former CBI JD Lakshminarayana in YCP
Former CBI JD Lakshminarayana in YCP

అక్కడే వైద్య పరీక్షలకు సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమానికి ఆయన నన్ను ఆహ్వానించారు. ఆ సమావేశంలో నేను వైద్య శిబిరాలు, నాడు-నేడు కార్యక్రమాలను అభినందించానని వెల్లడించారు. అంతమాత్రాన నేను అధికార పార్టీలో చేరుతున్నానని, వచ్చే ఎన్నికల్లో వారి టిక్కెట్టుపై పోటీ చేస్తానంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేయడం సరికాదని ఆగ్రహించారు. ఈ ఊహాగానాలలో ఏ మాత్రం నిజం లేదని తేల్చి చెప్పారు. ప్రజలు తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దని నేను అభ్యర్థిస్తున్నాను. ఓటర్ల చైతన్య కార్యక్రమం కొనసాగించే నా పోరుబాటకు కట్టుబడి ఉన్నానని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news