వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ.సుబ్బారెడ్డి మాతృమూర్తి మృతికి మాజీ సీఎం వైయస్.జగన్ సంతాపం తెలిపారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వై.వి.సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ మృతి పట్ల వైయస్.జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని తెలియజేశారు. పిచ్చమ్మ ఆత్మకు శాంతి చేకూరాలంటూ భగవంతుడ్ని కోరుకుంటానన్నారు. 85ఏళ్ల పిచ్చమ్మ కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.