పార్టీ మార్పు ప్రచారంపై కేతిరెడ్డి సంచలన ప్రకటన..వీడియో లీక్‌ !

-

అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పార్టీ మారుతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా వైసీపీ నేతలు.. బయటకు వెళ్లారు. ఇంకా వెళుతున్నారు. అయితే.. తాజాగా వైసీపీ పార్టీ మార్పు ప్రచారం ప్తె సోషియల్ మీడియా వేదికగా స్పందించారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. తాను పార్టీ మారడం లేదని తెలిపారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.

Former Dharmavaram MLA Kethireddy Venkataramireddy reacted to YCP’s change campaign on social media

35 ఏళ్లుగా వైఎస్ ఫ్యామిలీతోనే ఉంటున్నామని ఇకపై కూడా ఆ కుటుంబంతోనే కలిసి నడుస్తామన్న కేతిరెడ్డి….రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్ వెంటే ఉంటానని ప్రకటించారు. ఎల్లవేళలా జగన్ కుటుంబానికి తోడుగా ఉంటామని తెలిపారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. జగన్ కుటుంబ సభ్యులే బయటకు వెళ్లారని… పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు. నన్ను నమ్ముకున్న వారి కోసమే రాజకీయాలు చేస్తున్నానని పేర్కొన్నారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news