వైఎస్‌ఆర్‌ జయంతి.. మాజీ మంత్రి రోజా ట్వీట్‌ వైరల్‌

-

వైఎస్‌ఆర్‌ జయంతి నేపథ్యంలో మాజీ మంత్రి రోజా చేసిన ట్వీట్‌ వైరల్‌ గా మారింది. రోడ్డు ప్ర‌మాదాల‌లో మ‌ర‌ణాల‌ను వీలైనంత త‌క్కువ చేయ‌డానికి 108 అంబులెన్స్‌ల‌ను తీసుకువ‌చ్చారు డాక్ట‌ర్ వైయ‌స్ఆర్ గారు అని రోజా తెలిపారు. ఈ 108 అంబులెన్స్ ఆవిష్క‌ర‌ణ రాష్ట్ర వైద్య చ‌రిత్ర‌లోనే ఓ సంచ‌ల‌నంగా నిలిచిందన్నారు.

Former Minister Roja’s tweet went viral on the occasion of YSR Jayanti

ఆరోగ్యానికి పెద్ద‌పీట వేస్తూ ఎంతోమందికి పున‌ర్జ‌న్మ ప్ర‌సాధించిన దేవుడు వైయ‌స్ఆర్ గారు. నేడు ఆ మ‌హ‌నీయుడి జ‌యంతి సంద‌ర్భంగా నివాళులు అంటూ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు రోజా. దివంగత నేత వైయస్ ఆర్ ప్రజల గుండెల్లో చిరస్దాయిగా నిలిచారన్నారు.

ఆయన తీసుకువచ్చిన ఆరోగ్యశ్రీ , 108 ప్రజలకు ఎంతగానో దోహదపడ్డాయని తెలిపారు. ఆయన చేసిన మంచి మనం మరచిపోకూడదని… వైయస్ ఆర్ భౌతికంగా లేకపోయినా ఆంద్రప్రదేశ్ ప్రజల గుండంల్లో ఎప్పుడూ చిరస్మరణీయులే అంటూ స్పష్టం చేశారు మాజీ మంత్రి రోజా.

Read more RELATED
Recommended to you

Latest news