తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సుగుణమ్మ !

-

తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సుగుణమ్మ ఫైనల్‌ అయినట్లు సమాచారం అందుతోంది. తిరుపతి సీటుపై కసరత్తు ప్రారంభించింది టిడిపి పార్టీ. ఇందులో భాగంగానే… మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. జనసేన సైతం సీటును కోరుతున్న నేపధ్యంలో చంద్రబాబు నిర్ణయంపై టిడిపి నేతల్లో టెన్షన్ నెలకొంది.

Former MLA Sugunamma as Tirupati TDP candidate

టిడిపి పార్టీలో సుగుణమ్మ..జెబీ శ్రీనివాస్ సహా పది మందిపైగా సీటు కోరుతున్నారు నాయకులు. జనసేనలో రేసులో కిరణ్ రాయల్ , హరి ప్రసాద్ లు టికెట్‌ కోసం ఎదురు చూస్తున్నారు. నేటి తిరుపతి నేతల భేటీ తరువాత క్లారిటీ వస్తుందన్న భావనలో ఇరు పార్టీల నేతలు ఉన్నారు. అయితే..తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సుగుణమ్మ ఫైనల్‌ అయినట్లు తెలుస్తోంది. అక్కడ గెలిచే శక్తి, సత్తా సుగుణమ్మకు మాత్రమే ఉందని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news