BREAKING : అరకులోయ సమీపంలో మూడు బైకులు ఢీకొని నలుగురు దుర్మరణం

-

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాదల పంచాయతీ తుమ్మగుడ్లి గ్రామ సమీపంలో మూడు ద్విచక్రవాహనాలు ఢీకొట్టుకోవడం వల్ల జరిగిన ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి పంపారు. మరోవైపు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

A terrible accident in AP Three youths died

అరకులోయ మండలంలోని నందివలస గ్రామంలో మహాశివరాత్రి జాతరకు చూసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి 10 గంటల 30 నిమిషాల ప్రాంతంలో జరిగినట్లు వెల్లడించారు. మృతుల్లో చర్లపూడి గ్రామానికి చెందిన బురిడి హరి (22), అమ్మనాకాంత్‌ (9), లోతేరు పంచాయతీ మంజగుడకి చెందిన త్రినాథ్‌ (32), భార్గవ్‌ (4)లు ఉన్నారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news