ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్. వేసవి సెలవులు ముగించుకొని విద్యార్థులు పాఠశాలలకు తిరిగి వెళుతున్నారు. జూన్ 12వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. దీంతో పాఠశాలలు విద్యార్థులతో నిండిపోతున్నాయి. కాగా కూటమి ప్రభుత్వం విద్యార్థుల కోసం అనేక రకాల సంక్షేమ పథకాలను అమలులోకి తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. స్కూల్ ప్రారంభమైన రోజే పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతేకాకుండా విద్యార్థులకు కిట్ల పంపిణీ కూడా చేశారు.

ఈ క్రమంలోనే విద్యార్థులకు ఆర్టీసీ సంస్థ శుభవార్త అందజేసింది. విద్యార్థులకు పదవ తరగతి వరకు ఉచిత బస్సుపాస్ ల సౌకర్యాన్ని కల్పించింది ఆర్టీసీ సంస్థ. పాత పాస్ లను మార్చుకొని కొత్త వాటి కోసం దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు రాయితీ పాస్ లు అందుబాటులో ఉన్నాయని అన్నారు. మరిన్ని వివరాల కోసం ఆర్టీసీ వెబ్సైట్ సంస్థను సందర్శించమని ఆర్టీసీ సంస్థ కోరింది. ఈ అవకాశాన్ని వెంటనే సద్వినియోగం చేసుకోవాలని ఆలస్యం చేయకండి అంటూ స్పష్టం చేశారు.