థ్యాంక్యూ కరోనా… గంటా మనసులో మాట!

-

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో.. అందునా విశాఖ వైకాపాలో గంటా శ్రీనివాస్ హాట్ టాపిక్! గంటా శ్రీనివాస్ వైకాపాలోకి వస్తోన్నారనే కథనాలు రావడం మొదలైనప్పటినుంచి వైకాపాలో ఇంటర్నల్ పాలిటిక్స్ మారిపోయాయని కథనాలొస్తున్నాయి. ఈ క్రమంలో వైకాపాలోకి గంటా రాకాను ఏమాత్రం స్వాగతించని వారు ఇప్పటికే జగన్ దగ్గర లాజిక్ లన్నీ వాడుతున్నారని, ఇదే సమయంలో గంటా రాకను ఆకాంక్షించే బ్యాచ్ కూడా జగన్ కు చెప్పేవి చెబుతున్నారని అంటున్నారు!

ఆ ఇంటర్నల్ పాలిటిక్స్ అలా ఉంటే… గంటాకు మాత్రం ఒక విషయం హ్యాపీగా ఉందని అంటున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ప్రపంచం అంతా వణికిపోతుంటే… ఏపీలో గంటా శ్రీనివాస రావు మాత్రం చాలా హ్యాపీ అండ్ కంఫర్ట్ ఫీలవుతున్నారట. దానికి కారణం సాయిరెడ్డి క్వారంటైన్ లో ఉండటమే అనేది ఆన్ లైన్ వేదికగా జరుగుతున్న ప్రచారం!

అవును… విజయసాయిరెడ్డి టార్గెట్ లోని టీడీపీ మంత్రుల్లో గంటా శ్రీనివాస్ ఒకరు. ఈ క్రమంలో ఇప్పటికే ట్విట్టర్ వేదికగా… బాలికలకు ప్రభుత్వం సైకిళ్లు అందించే కార్యక్రమంలో సుమారు ఐదు కోట్ల రూపాయలవరకూ స్కాం జరిగిందని.. ఇదంతా గంటాపనే అనేది సాయిరెడ్డి ట్వీట్ల సారాంశం. ఈ క్రమంలో ఆ సంగతికి కాసేపు పక్కనపెట్టిన కొందరు వైకాపా నేతలు… ఆ టాపిక్ ని కాస్త హైడ్ ఆర్ హోల్డ్ లో ఉంచి గంటాను ఫ్యాన్ కిందకు తేవాలని తాపత్రయపడుతున్నారట!

గంటా రాకను ఏమాత్రం స్వాగతించని సాయిరెడ్డి… ప్రస్తుతం క్వారంటైన్ లో ఉండటంతో… గంటా రాకను ఆకాంక్షించే వారి రాజకీయాలు జగన్ దగ్గర మరింత బలంగా వినిపిస్తున్నాయని.. వారిలో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఒకరని అంటున్నారు! సాయిరెడ్డికి క్వారంటైన్ పూర్తయ్యే లోపు ఈ కార్యక్రమం పై జగన్ నుంచి ఒక క్లారిటీ తెచ్చేసుకోవాలని ప్రయత్నిస్తున్న తరుణంలో… కరోనా కు గంటా థ్యాంక్స్ చేబుతున్నారని అంటున్నారు!!

Read more RELATED
Recommended to you

Latest news