రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక కాంగ్రెస్ పాత్ర లేదు – ఏపీ కాంగ్రెస్

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు సంచలన కామెంట్స్‌ చేశారు. రేపు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారన్నారు గిడుగు రుద్రరాజు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం మేధావి వర్గం కలిసి వస్తున్నాయి…గాజువాక తో పాటు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాల నుంచి చేరిక ఉంటుందన్నారు. రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక కాంగ్రెస్ ఉందనే ప్రచారాన్ని వైసీపీ, ప్రభుత్వ సలహాదారులు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు.

gidugu rudraraju about ysr issue

కాంగ్రెస్ పార్టీ పరువుకు భంగం కలిగించే ప్రచారాలపై న్యాయ పోరాటం చేస్తాం….లీగల్ నోటీసులు పంపిస్తున్నామని తెలిపారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితేనే రాజశేఖర్ రెడ్డి మరణం మీద ఈ ప్రభుత్వానికి అనుమానాలు మొదలయ్యాయా…? అని ప్రశ్నించారు. రాజకీయాల కోసం వేరే ఆరోపణలు, ప్రచారాలు చేసుకోండి కానీ మహానాయకుడి మరణంతో ముడిపెట్ట వద్దని హెచ్చరిస్తున్నాం…త్యాగి కమిటీ విచారణ చేసి 139పేజీలు నివేదిక ఇచ్చిందని తెలిపారు. ఎంక్వైరీలో ప్రమాదం వల్లే రాజశేఖర్ రెడ్డి మరణం జరిగిందని తేలింది….ఎన్నికల్లో కాంగ్రెస్, సోనియా గాంధీని ఇబ్బంది పెట్టే చర్యలు ప్రతీ సారీ జరుగుతున్నాయని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news