సంగం బ్యారేజి వద్ద మాజీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి పేరు తొలగింపు..!

-

సంగం బ్యారేజ్ కి మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనలో పెట్టిన పేరును కూటమి ప్రభుత్వం అధికారంలోకి  వచ్చాక తొలగింపు చర్యలకు శ్రీకారం చుట్టింది. నెల్లూరు జిల్లా లోని  సంగం బ్యారేజి వద్ద మాజీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి పేరును తొలగించారు అధికారులు.

వైసీపీ హయాంలో సంగం బ్యారేజ్ కి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెట్టింది అప్పటి ప్రభుత్వం. అయితే ఇటీవలే మేకపాటి గౌతమ్ రెడ్డి పేరును తొలగిస్తూ ఆదేశాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. తాజాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు బోర్డుల తొలగింపు కార్యక్రమం చేపట్టారు అధికారులు. దీంతో పలువురు వైసీపీ నేతలు అసహనం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో పెట్టిన పేర్లను తొలగించాలని కూటమి ప్రభుత్వం జీవో జారీ చేసింది అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version