ఏపీ ఉద్యోగులకు జగన్‌ సర్కార్‌ శుభవార్త.. ఉగాదికి సెలవు ఇస్తూ ఉత్తర్వులు

-

రేపు ఉగాది పర్వదినం. ఈ నేపథ్యంలో జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 2 వ తేదీని సెలవు దినంగా ప్రకటిచింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ అధికారి ముత్యాల రాజు నోటిఫికేషన్‌ జారీ చేశారు. అయితే.. ఉగాది రోజుల కొత్త జిల్లాల ప్రకటన చేస్తున్నందున ఏప్రిల్‌ 2 వ తేదీన సెలవు లేదని ప్రకటన చేసింది సర్కార్‌.

CM Jagan Mohan Reddy
CM Jagan Mohan Reddy

దీనిపై పలు విజ్ఙప్తులు రావడంతో… జగన్‌ సర్కార్‌ తన నిర్ణయాన్ని మార్చుకుంది. రేపటి రోజున హాలిడే ప్రకటిస్తూ… ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్‌. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటు తేదీని ఏప్రిల్‌ 4 వ తేదీకి వాయిదా వేసుకుంది జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌. దీంతో ఉగాది పండుగకు సెలవు వచ్చింది. దీంతో ఏపీ ఉద్యోగులు పండుగ చేసుకుంటున్నారు. కాగా.. కొత్త జిల్లాల ఏర్పాటుకు కూడా ముహుర్తం ఖరారైంది. ఏప్రిల్‌ 4 ఉదయం 9 గంటల 5 నిమిషాల నుంచి 9.45 నిమిషాల మధ్య కొత్త జిల్లాల అవతరణ చేపట్టాలని ఏపీ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news