ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రేపు టెట్ నోటిఫికేషన్

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధం అవుతోంది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న డిమాండ్ పై ముందడుగు వేసింది. టెట్ పరీక్ష నిర్వహించేందుకు కసరత్తు పూర్తి చేసింది. ఈ మేరక టెట్ పరీక్ష నోటిఫికేసన్ ను గురువారం విడుదల చేయనుంది. అదేవిదంగా గురువారం ఈనెల 18 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరించనుంది. ఈనెల 27 నుంచి మార్చి 08 వరకు టెట్ పరీక్షలను అధికారులు నిర్వహించనున్నారు. మార్చి 14న ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారులు చేసిన కసరత్తు ముగియడంతో టెట్ నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు.

గురువారం మధ్యాహ్నం వరకు టెట్ నోటిఫికేషన్ ను అధికారికంగా ప్రకటించనున్నారు. మరోవైపు 6,100 టీచర్ల పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో ఎస్జీటీ 2280, స్కూల్ అసిస్టెంట్ 2299, టీజీటీ 1264, పీజీటీ 215, ప్రిన్సిపాల్ 42 పోస్టులకు మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం డీఎస్పీ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈనెల 12 నుంచి లైన్ లోన్ లో దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news