పేద విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా 2025-26 అకాడమిక్ ఇయర్ లో అన్ని ప్రైవేట్, అన్ ఎయిడెడ్ స్కూళ్ళలో పేద, బలహీన వర్గాల పిల్లలకు ఉచిత సీట్ల కేటాయింపుపై నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యా హక్కు చట్టం ప్రకారం 1వ తరగతిలో 25% సీట్లు పేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులకు కేటాయిస్తూ నోటిఫికేషన్ విడుదలైంది.
ఐదు ఏళ్లు నిండిన వివరాలతో కూడిన వివరాలను ఈనెల 28 నుంచి మే 15వ తేదీ వరకు ప్రభుత్వానికి అప్లికేషన్స్ సమర్పిస్తే.. వాటిని అధికారులు పరిశీలించి అర్హులైన విద్యార్థులకు సీట్లు కేటాయించనున్నట్టు పేర్కొంది. అయితే అప్లికేషన్ తో పాటు తల్లిదండ్రుల ధృవీకరణ పత్రాలైన ఆధార్/ఓటర్/రేషన్/జాబ్ కార్డు/ విద్యుత్ బిల్లులో ఏదైనా ఒక దానితోపాటు.. విద్యార్థి బర్త్ సర్టిఫికెట్ అటెస్ట్ చేయాలని తెలిపింది.