డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ శుభవార్త..రేపు వైఎస్సార్‌ సున్నా వడ్డీ నిధులు విడుదల

-

ఏపీలో డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. రేపు వైఎస్సార్‌ సున్నా వడ్డీ నిధులు విడుదల చేయనుంది ఏపీ సర్కార్‌. ఇందులో భాగంగగానే రేపు ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి అమలాపురంలో పర్యటించనున్నారు.

ఈ సందర్భంగా వైఎస్సార్ సున్నావడ్డీ పథకం నాలుగో విడత నిధులను విడుదల చేయనున్నారు సీఎం జగన్‌. 9.48లక్షల డ్వాక్రా గ్రూపులకు రూ. 1358.78 కోట్లను మహిళల ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం జగన్‌. అనంతరం జనుపల్లి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు సీఎం జగన్.

అనంతరం తిరిగి తాడెపల్లి గూడెం తిరిగి వెళ్లనున్నారు. ఇక ఇవాళ ఆప్కాబ్, సహకార రంగం పై సమీక్ష చేయనున్న ముఖ్యమంత్రి జగన్.. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తారు.సహకార రంగానికి, డీససీబీల అభివృద్ధికి మరింత ఊతం ఇచ్చే దిశగా చర్చ నిర్వహిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news