నేడు శ్రీకాకుళం లో టిడిపి అధినేత చంద్రబాబు పర్యటన

-

 

నేడు శ్రీకాకుళం లో టిడిపి అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సాగునీటి ప్రోజెక్ట్ ల పై యుద్దభేరి కార్యక్రమంలో పాల్గొంటారు చంద్రబాబు నాయుడు. అనంతరం నాగావళి వంశధార అనుసందాన హైలెవిల్ కెనాల్ పరిశీలన చేస్తారు చంద్రబాబు.

అ తర్వాత హిర మండలం రిజర్వాయర్‌ ను పరిశీలించనున్న బాబు….వంశధార‌ నిర్వాసితులతో ముఖాముఖిలో పాల్గొంటారు. ఇక కొత్తూరు మండల‌కేంధ్రంలో సాయంత్రం బహిరంగ సభ లో చంద్రబాబు ప్రసంగిస్తారు.

కాగా, నేటి నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మూడో విడత వారాహి యాత్ర ప్రారంభం కానుంది. పవన్ కళ్యాణ్ మూడో విడత వారాహి యాత్ర విశాఖ నుంచే ప్రారంభం అవుతుంది. ఇందులో భాగంగానే ఇవాళ సాయంత్రం విశాఖలోని జగదాంబ సెంటర్ లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో పాల్గొంటారు.

 

Read more RELATED
Recommended to you

Latest news