గుడ్లవల్లేరు కళాశాల కేసులో ట్విస్ట్.. రంగంలో CERT టీం !

-

గుడ్లవల్లేరు కళాశాల కేసులో ట్విస్ట్ నెలకొంది. కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి CERT టీం వెళ్లనుంది. ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరా లపై విద్యార్థుల సందేహాలకు సమధానాలు ఇస్తామని CERT టీం పేర్కొంటోంది. ఈ మేరకు గుడ్లవల్లేరు కళాశాల ఘటనపై విచారణకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చారు.

Government’s key orders for inquiry into Gudlavalleru College incident

బాలికల హాస్టల్ లో హిడెన్ కెమెరాలు పెట్టారని విద్యార్థుల ఫిర్యాదుపై దుమారం రేగింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు లోతైన విచారణ చేపట్టిన పోలీసులు.. విచారణ చేస్తున్నారు. ఇక తాజాగా కంప్యూటర్ ఎమర్జన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT) ద్వారా ఆధారాలు సేకరించాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. CERT టీం వద్దకు వచ్చి ఏమైనా ఆధారాలు ఉంటే ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటలకు సమర్పించాలని విద్యార్దులను కోరారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news