మోడీకి కాదు..బైడెన్‌, పుతిన్‌ కు చెప్పుకో – గుడివాడ సెటైర్లు

-

మోడీ ప్రభుత్వంతో…. ఒక రోజు జగన్ ను ఆట ఆడిస్తానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వార్నింగ్ ఇచ్చారు. అయితే.. పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలకు మంత్రి అమర్నాథ్ కౌంటర్‌ ఇచ్చారు. కేంద్రానికి ఫిర్యాదు చేస్తే ఎవరికి భయం అంటూ ఫైర్ అయ్యారు. కేంద్రానికి కాకపోతే బైడన్ కో, పుతిన్ కో చెప్పుకో…..మాకేం భయం లేదని తేల్చి చెప్పారు.

కేంద్రం దగ్గర పవన్ కు ఉన్నది పలుకుబడి కాదు చంద్రబాబు దగ్గర రాబడి అంటూ మండిపడ్డారు. రాజకీయాల్లో పవన్ పిల్లబచ్చా…..ఇటువంటి వాళ్ళను చూసి భయపడే వ్యక్తి జగన్ కాదని వెల్లడించారు. ఏపీని ఆదర్శంగా తీసుకున్న రాష్ట్రాలు వున్నాయి…వాలేంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్నారని చేసిన వ్యాఖ్యలు అభ్యంతరం కరం అని మండిపడ్డారు. సినిమా పరిశ్రమలో ఉన్న మహిళల గురించి విమర్శలు చేసినప్పుడు నోరు మెదపని పవన్…..ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో మహిళల రక్షణ గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. జగన్ సైన్యంగా అపారమైన సేవలు అందిస్తున్న వాలెంటీ ర్ వ్యవస్థను దూరం చేసే ప్రయత్నం జరుగుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news