BREAKING: GVMC నోటీసులు చించేసిన గుడివాడ అమర్నాథ్ !

-

BREAKING: GVMC నోటీసులు చించేశారు ఏపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. విశాఖ ఎండాడలోని వైసీపీ కారాలయానికి చేరుకున్న మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్….GVMC నోటీసులు చించేశారు. నోటీసులపై ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది టౌన్ ప్లానింగ్ విభాగం. కార్యాలయంలో ఎవరు లేని సమయంలో గోడలకు నోటీసులు అతికించి వెళ్ళడంపై వైసీపీ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగాంగానే.. విశాఖ ఎండాడలోని వైసీపీ కారాలయానికి చేరుకున్న మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్….GVMC నోటీసులు చించేశారు.

gvmc notic to ycp office

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గతంలో మా ప్రభుత్వం హయాంలో విద్వాంసాలకు పాల్పడలేదు..పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని, సచివాయాన్ని ధ్వంసం చెయ్యడం హేయమైన చర్య అని ఫైర్‌ అయ్యారు. ఇలాంటి అరాచక పాలన సరికాదన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాన్ని మరో బీహార్ లా మార్చడం సరికాదని నిప్పులు చెరిగారు. కార్యకర్తలు, నేతలపై దాడులు చెయ్యడం సిగ్గు చేటు..ఇలాంటి చర్యలు దేనికి సంకేతమని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news