సబ్బం హరికి షాక్.. ఇంటి ప్రహరీ కూలుస్తున్న జేవీఎంసీ !

-

విశాఖలో టీడీపీ నేత సబ్బం హరికి విశాఖ కార్పోరేషన్ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయన ఇంటికి అనుకోని ఉన్న టాయిలెట్ రూమ్ ని జీవీఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. ఇవన్నీ అక్రమ కట్టడాలని అధికారులు అంటున్నారు. అయితే ముందుగా సమాచారం ఇవ్వకుండా జేసీబీ లతో ఎలా కూల్చివేస్తారని అధికారులు పై టీడీపీ నేత సబ్బం హరి మండిపడుతున్నారు. ఇక జీవీఎంసీ అధికారులు సరిహద్దులు కూడా మారుస్తునారు.

అయితే ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా జరుగుతోన్న కూల్చివేతలపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కూల్చివేతలపై సమాధానం ఇవ్వడానికి జీవీఎంసీ నిరాకరించారు. అయితే అక్రమకట్టడం అయితే అందుకు తగిన పేపర్లు చూపిస్తే ఓ గంటలో తానే ఆ రూమ్‌ని కూల్చేస్తానని చెప్పినా.. అధికారుల నుంచి సమాధానం లేదని, వేకుమజామున నాలుగున్నరకి ఇలా కూల్చి వేస్తున్నారని తెలిసిన వాళ్ళు నిద్రలేపారని ఏమి జరుగుతుందో అసలేం అర్ధం కాలేదని సబ్బం హరి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news