ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు అక్కడిక్కడే మృతి !

-

కర్ణాటకాలో నిన్న రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాడం ఆరుగురు ప్రాణాలు బలితీసుకుంది. 23 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. నిన్న రాత్రి బెలగావి జిల్లాలోని సవదట్టి పట్టణ శివార్లలోని సవదట్టి – ధార్వాడ్ రహదారిపై బొలెరో మరియు టాటా ఏస్ వాహనం ఢీ కొన్న ప్రమాదంలో  ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందగా, 23 మంది తీవ్రంగా గాయ పడ్డారు.

అయితే మృతులు, గాయపడిన వారిని ఇంకా ఎవరు అనేది గుర్తించ లేదు. పోలీసుల ప్రాథమిక అంచనా ప్రకారం, మృతులు సవదట్టిలోని చుంచ్నూర్ గ్రామానికి చెందిన వారని, వారంతా పని కోసం వచ్చి తర్వాత ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. ఎదురెదురుగా వస్తు్న్న బొలెరో, టాటా ఏస్ వాహనాలు ఢీకొట్టుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాధమిక అంచనా.

Read more RELATED
Recommended to you

Latest news