జగన్ ఎప్పుడైనా తిరుమల లడ్డు తిన్నారా..? : హోంమంత్రి అనిత

-

జగన్ ఎప్పుడైనా తిరుమల లడ్డు తిన్నారా..? అని ఏపీ హోంమంత్రి అనిత ప్రశ్నించారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అక్షింతలు వేసిన వెంటనే దులుపుకున్న వ్యక్తి జగన్. జగన్ ను మేము అడ్డుకోలేదు. జగన్ కు తిరుమల వెళ్లడం ఇష్టం లేకనే పర్యటన రద్దు చేసుకున్నారు. ప్రసాదాన్ని టిష్యూ పేపర్ లో పెట్టుకొని పక్కనే పడేసే వ్యక్తులు వాళ్లు అన్నారు.

సంతకం పెట్టి వెళ్లాలనే దానికి రాద్దాంతం చేశారు. దళితులు అనే పదం నోట్లో నుంచి రావడానికి జగన్ కి అర్హత లేదు. తిరుమల బోర్డు ను భ్రష్టు పట్టించడానికి సలహామెంబర్లను ఎందుకు పెట్టారు. నువ్వు ఇచ్చిన బోర్డులో ఒక్కరూ కూడా దళితులు లేరు. ఇప్పుడు దళితుల గురించి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. గతంలో మీ దగ్గర పని చేసిన పోలీసులే సిట్ లో ఉన్నారు. తిరుమలలో గ్యాంగ్ ఆర్డర్ కోసం ఎందుకు కేసు వేశారు. మసీదులు, చర్చీలు, ఆలయాలకు ప్రత్యేక ఆచారాలుంటాయి. జగన్ తప్పు చేసి క్షమాపణ కోరడం లేదు. తప్పు చేయకపోతే విజిలెన్స్ రిపోర్ట్ పై కోర్టుకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. హైందవ సాంప్రదాయాలను ఎందుకు గౌరవించడం లేదు. ఆయా ప్రార్థన మందిరాలకు వెళ్లినప్పుడు అక్కడి ఆచారాలను గౌరవించాలన్నారు హోంమంత్రి అనిత. 

Read more RELATED
Recommended to you

Exit mobile version