ఆవుల్ని వధించనని చెప్పినందుకు స్తంభానికి కట్టేసి చావ బాదారు!

-

ఆవుల్ని వధించనని చెప్పినందుకు స్తంభానికి కట్టేసి చావ బాదారు. ఈ దారుణమైన సంఘటన శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో అక్రమంగా నడుపుతున్న కబేళాలో పశువులను వధించాలని పరిగికి చెందిన వాజిద్‌ను తీసుకెళ్లారు నిర్వాహకులు.

He was tied to a pole and died for saying that he would not slaughter cows

కానీ అక్కడ ఎద్దులకు బదులు ఆవులు కనిపించడంతో వాటిని వధించేందుకు వాజిద్ నిరాకరించాడు. దీంతో ఫోన్ దొంగలించావంటూ వాజిద్ పై అబద్ధపు ఆరోపణులు చేసి అతన్ని స్తంభానికి కట్టేసి కొట్టారు వ్యాపారులు. దీంతో ఈ సంఘటన ఇప్పుడు వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news