ఏపీ నాయకుల కోసం హెల్మెట్లు… ఫోటోలు వైరల్

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పై రాళ్లతో దాడులు చేశారు కొంతమంది దుర్మార్గులు. విజయవాడలో ప్రచారం చేస్తున్న సమయంలో రాళ్లతో జగన్మోహన్ రెడ్డి పై దాడి చేశారు. ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి కంటికి తీవ్రమైన గాయం అయింది. అయితే జగన్ తో పాటు వెల్లంపల్లి శ్రీనివాస్ కు కూడా గాయమైంది.

అటు నిన్న పవన్ కళ్యాణ్ పై కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో కొట్టారు. ఈ తరుణంలో ఏపీ రాజకీయ నాయకులు ప్రచారంలో పాల్గొనేటప్పుడు హెల్మెట్లు వాడాలని సూచనలు చేస్తున్నారు సోషల్ మీడియా వారియర్స్. హెల్మెట్లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి.. ప్రచార సమయంలో హెల్మెట్స్ వాడండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version