బాలిక హత్య ఘటనపై హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు

-

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెం మైనర్ బాలిక హత్య ఘటనపై స్పందించారు హోంమంత్రి అనిత. అనకాపల్లి జిల్లా ఎస్పీతో ఫోన్ లో మాట్లాడిన హోం మంత్రి…హుటా హుటిన సంఘటన స్థలానికి కూడా చేరుకున్నారు. వెంటనే నిందితున్ని పట్టుకోవాలని ఆదేశించారు.
కాగా, అనకాపల్లి జిల్లా రాంబిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనీ కొప్పు గొండు పాలెం లో దారుణం చోటు చేసుకుంది.

Home Minister Anitha key directives on the girl incident

9వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ సైకో కత్తితో దాడి చేసి హత్య చేశాడు. గతంలో బాలికపై వేధింపులకు పాల్పడిన సైకో సురేష్ పై ఫిర్యాదు చేయడంతో జైలుకు పంపారు పోలీసులు. ఇక 20 రోజుల క్రితం బెయిల్ పై బయటకు వచ్చిన సురేష్… జైలుకు పంపించారని కక్ష మనసులో పెట్టుకుని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. నిన్న సాయంత్రం స్కూల్ నుండి ఇంటికి వచ్చింది మైనర్ బాలిక.

అప్పటికే రెక్కీ నిర్వహించి ఇంట్లోకి చొరబడ్డాడు సురేష్. వెంట తెచ్చుకున్న కత్తితో పీక కోసి పరార్ అయ్యాడు. మైనర్ బాలిక అరుపులు బయటకు రాకుండా.. నోట్లో గుడ్డలు కూడా కుక్కాడట. ఇక ఈ ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీం… నిందితుడి కోసం ప్రత్యేకగా గాలిస్తున్నాయి. అటు మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ కు తరలించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version