ప్రేమించి పెళ్ళి చేసుకుని భర్త మోసం..సీఎం జగనే న్యాయం చేయాలని యువతి !

-

చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్ళి చేసుకున్న భర్త… మోసం చేశాడంటూ మూడేళ్ళగా ఓ యువతీ…న్యాయం పోరాటం చేస్తోంది. దీంతో చిత్తూరు జిల్లా కార్వేటినగరం పిఎస్ ఫిర్యాదు చేసింది ఆ యువతి. కడప జిల్లా పులివెందల చెందిన శీరిషానే ఆ యువతి. జిడి నెల్లూరు నియోజక వర్గం కార్వేటినగరం మండలం ఈదివారిపల్లె చెందిన నిరంజన్.. విజయవాడలో జిస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో బిటెక్ చదివే సమయంలో శీరిషా ప్రేమించాడు.

అనంతరం.. 2019లో శీరిషాను పెళ్ళి చేసుకున్న నిరంజన్… మూడేళ్ళ తర్వాత అంటే ఇప్పుడు నాకు సంబంధం లేదంటూ శిరిషాను వదిలేశాడు. నిరంజన్ మోసం చేశాడంటూ విజయవాడ, పులివెందల, కడప ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదు పోలీసులు. నిరంజన్ కు కౌన్సిలింగ్ ఇచ్చి పోలీసులు చేతులు దులుపుకున్నారని కన్నీటి పర్యంతం అవుతోంది శిరిషా. ఇక అటు వేరే పెళ్ళి చేయడానికి నిరంజన్ తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే సిఎం జగన్ చోరవ తీసుకుని నాకు న్యాయం చేయాలని, లేదంటే నాకు చావే శరణ్యం అంటూ మీడియా ముందుకు వచ్చింది శిరిషా. దీనిపై పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version