ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థిని బలవన్మరణం

-

ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో ఇంజినీరింగ్‌ చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. కుర్రిరేఖ అనే విద్యార్థిని ఆదివారం రాత్రి హాస్టల్‌ భవనంపై నుంచి దూకి బలవన్మరం చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా కంభం మండలం జంగంగుట్ల గ్రామానికి చెందిన రేఖ ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం చదువుతోంది. ఆదివారం రాత్రి 7.30గంటల ప్రాంతంలో ఆమె హాస్టల్‌ భవనంపై నుంచి దూకడంతో ఆమె కాలు విరగడంతోపాటు తీవ్రంగా గాయపడింది. ట్రిపుల్‌ఐటీ సిబ్బంది ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ రాత్రి 10.30గంటల ప్రాంతంలో ఆమె మృతి చెందింది. ఇంజినీరింగ్‌ కోర్సు పూర్తి చేసుకున్న ఈ విద్యార్థిని మరో పదిరోజుల్లో ఇంటికి వెళ్లాల్సి ఉండగా బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు సదరు విద్యార్థిని చరవాణిని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఆమె స్నేహితులు, సిబ్బందిని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news