నేడు పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు ప్రభుత్వం. జాతీయ పతాకం ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి… ఉత్తమ సేవలందించిన పోలీసులకు మెడల్స్ అందజేయనున్నారు. కాగా వాహనదారులకు అలెర్ట్..నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ మల్లింపులు ఉండనున్నాయి.

ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్ గన్ పార్క్ లో ఆవిర్భావ వేడుకలు నిర్వహించబోతున్నారు. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ట్రాఫిక్ ను మళ్ళించనున్నారు. రవీంద్ర భారతి వద్ద ఇక్బాల్ మినార్ జంక్షన్ వైపు, నాంపల్లి నుంచి రవీంద్రభారతి వైపు ట్రాఫిక్ ను అనుమతించరు. AR పెట్రోల్ పంపు వద్ద బషీర్ బాగ్ BJR విగ్రహం వైపు ట్రాఫిక్ ను మళ్ళించనున్నారు. ప్యాట్నీ నుంచి తిరుమలగిరి వైపు వచ్చే ట్రాఫిక్ ను YMCA, స్వీకార్ – ఉపకార్ టికెట్ వైపు మళ్లీస్తారు.