చంద్రబాబును కలిసేందుకు వచ్చిన ఐపీఎస్ అధికారులు.. అనుమతి నిరాకరణ

-

టీడీపీ అధినేత, కాబోయే సీఎం చంద్రబాబును కలిసేందుకు యత్నించిన వివాదాస్పద ఐపీఎస్ అధికారులకు అనుమతి నిరాకరించారు. మర్యాదపూర్వక భేటీ పేరుతో రాగా పోలీసులు అడ్డుకున్నారు.
చంద్రబాబును కలిసేందుకు సీఐడీ చీఫ్ సంజయ్ యత్నించారు. కరకట్ట గేటు వద్ద కానిస్టేబుళ్లు ఆయన కారును ఆపి వెనక్కి పంపారు. చంద్రబాబుపై అక్రమ కేసుల నమోదులో సంజయ్ కీలకంగా వ్యవహరించారు. ఎన్నికల ఫలితాలు రాగానే విదేశాలకు వెళ్లేందుకు సెలవు పెట్టారు. అది కూడా రద్దయినట్లు సమాచారం.

మర్యాదపూర్వక భేటీ పేరుతో సంజయ్ వచ్చిన విషయాన్ని అధికారులకు గేటు సిబ్బంది చెప్పారు. అన్యమతి లేదని చెప్పడంతో ఆయన కారును వెనక్కి పంపారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్దకు చేరుకోగా అనుమతి లేదని చెప్పారు. ఎన్నికల విధుల్లో అవకతవకలకు పాల్పడ్డారని ఆయన్ను ఎన్నికల సంఘం తప్పించింది. ఆ తర్వాత అనధికారికంగా కూడా వైసీపీ కోసం పనిచేశారనే ఆరోపణలు ఉన్నాయి. మరో సీనియర్ ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామిరెడ్డికి అనుమతి నిరాకరించారు. చంద్రబాబును కలిసేందుకు ఫోన్ లో ఆయన అనుమతి కోరగా.. తిరస్కరించారు. నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసే సమయంలో రఘురామిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. అలాగే గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డికీ ఇదే పరిస్థితే ఎదురైంది.

Read more RELATED
Recommended to you

Latest news