జీవో నెంబర్ 1 పై సుప్రీంకోర్టుకు జగన్ సర్కార్

-

గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు జీవో నెంబర్ 1 చుట్టూ తిరుగుతున్నాయి. టిడిపి అధినేత చంద్రబాబు పాల్గొన్న కందుకూరు, గుంటూరు సభల్లో తొక్కిసలాట కారణంగా 11 మంది మరణించిన విషయం తెలిసిందే. దీంతో బహిరంగ సభల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం తాజా మార్గదర్శకాలతో జీవో జారీ చేసింది. జీవో నెంబర్ 1 పేరున రోడ్ల పైన బహిరంగ సభలను నిషేధించారు.

దీనిపైన ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఇదే అంశంపై హైకోర్టులో పిల్ దాఖలయింది. దీనిని విచారించిన హైకోర్టు ఈనెల 23వ తేదీ వరకు జీవో అమలుపైన స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ జీవో పై స్టే విధించడానికి సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు జీవో నెంబర్ 1 కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన పిటిషన్ లో రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

Read more RELATED
Recommended to you

Latest news