రేపు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే..!

-

ఈనెల 24న (రేపు) సీఎం వైఎస్‌ జగన్‌ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జగనన్న విద్యాదీవెన పథకం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేయనున్నారు సీఎం జగన్. ఈ మేరకు సీఎంఓ షెడ్యూల్ విడుదల చేసింది. రేపు ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కొవ్వూరు చేరుకుంటారు సీఎం జగన్.

అక్కడ సత్యవతినగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం జగనన్న విద్యాదీవెన పథకం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేయనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం కొవ్వూరు నుంచి బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news