నంద్యాల జిల్లాలో రేపు పర్యటించనున్న జగన్‌

-

Jagan will visit Nandyala district tomorrow: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌.. నంద్యాల జిల్లా పర్యటన ఖరారు అయింది. ఈ మేరకు ప్రెస్‌ నోట్‌ రిలీజ్‌ చేసింది వైసీపీ పార్టీ. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ రేపు (09.08.2024) నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. టీడీపీ గూండాల దాడిలో హత్యకు గురైన పసుపులేటి పెద్ద సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

Jagan will visit Nandyala district tomorrow

ఉదయం 9 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి 10.15 గంటలకు ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామపురం చేరుకుని పసుపులేటి పెద్ద సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శిస్తారు, అనంతరం అక్కడి నుంచి బయలుదేరి ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని బెంగళూరు బయలుదేరి వెళతారు.

Read more RELATED
Recommended to you

Latest news