జగన్ పతనం పులివెందుల నుండే ప్రారంభమైంది – మాజీ మంత్రి ప్రత్తిపాటి

-

తాము ముందస్తు ఎన్నికలకు సిద్ధం అని స్పష్టం చేశారు మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నుండి మాతో అనేక మంది ఎమ్మెల్యే లు టచ్ లో ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ అరాచకాలకు చరమగీతం పాడేందుకు సిద్దం అవుతున్నాం అన్నారు ప్రత్తిపాటి. ఉమ్మడి జిల్లాలో 17 నియోజక వర్గాలు మేమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందన్నారు. జగన్ పతనం పులివెందుల నుండి ప్రారంభం అయ్యిందని.. ఆత్మ ప్రభోదానుసారం ఓటు వేస్తే ఏమవుతుందో ప్రభుత్వానికి అర్దం అయ్యిందన్నారు. జగన్ ప్రభుత్వం పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి లా మారిందని అన్నారు. చంద్రబాబును ఎందుకు వదులుకున్నం అని ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. జగన్ పులివెందులలో గెలవడం కూడా కష్టమేనన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news