వైసీపీకి షాక్‌…TDP లో చేరనున్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు !

-

వైసీపీకి షాక్‌ తగిలింది. టిడిపిలో చేరనున్నారు జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు. ఇప్పటికే టిడిపి పెద్దలతో చర్చలు పూర్తి చేసుకున్నారు వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు. 2009, 2014 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి తరుపున జగ్గంపేట నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014 లో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏలేరు ప్రాజెక్ట్ చైర్మన్ గా పనిచేశారు చంటిబాబు. జ్యోతుల నెహ్రూ వైసిపి నుంచి టీడీపీలోకి రావడంతో పార్టీ మారారు చంటిబాబు.

Jaggampet MLA Jyotula Chantibabu will join TDP

వచ్చే ఎన్నికల్లో జగ్గంపేట వైసిపి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని క్లారిటీ రావడంతో వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. జ్యోతుల నెహ్రూ, జ్యోతుల చంటిబాబులు బంధువులు కావడం గమనార్హం. ఎమ్మెల్యేగా ఉంటే తానుండాలి, లేదంటే తన కుటుంబానికి చెందిన వారు ఉండాలని బయటి వారికి ఎలా మద్దతిస్తామని అనుచరులతో చెబుతున్నారట చంటిబాబు. ఇక ఇందులో భాగంగానే… జనవరి 5 లేదా 6 తేదీలలో వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు….పసుపు పార్టీ కండువా కప్పుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version