సింగరేణి కార్మికుల సొంత ఇంటి కలను నిజం చేస్తాం – మంత్రి శ్రీధర్‌ బాబు

-

సింగరేణి కార్మికుల సొంత ఇంటి కలను నిజం చేస్తామని ప్రకటించారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు. పెద్దపల్లి జిల్లా సింగరేణి ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆర్జీ 3 పరిధిలోని ALP, ఓసీపీ 1, ఓసీపీ 2 బొగ్గుగనుల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీ తరుఫున మంత్రి శ్రీధర్ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ….ఐఎన్టీయూసీ కార్మిక సంఘాన్ని గెలిపించాలని సింగరేణి కార్మికులను కోరారు.

సింగరేణి కార్మికుల సొంత ఇంటి కలను నిజం చేస్తామని ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. నూతన అండర్ గ్రౌండ్ బొగ్గుగనులను ఏర్పాటు చేస్తామన్నారు. డిపెండెంట్ కార్మికులకు డబ్బులు ఖర్చు కాకుండా ఉద్యోగాలు వచ్చే విదంగా కృషి చేస్తామని వివరించారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి హైపవర్ కమిటీ వేస్తామని హామీ ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version