పెనమలూరులో బంపర్ మెజారిటీతో గెలిచి జగన్ కు గిఫ్ట్‌ గా ఇస్తా – జోగి రమేష్

-

పెనమలూరులో బంపర్ మెజారిటీతో గెలిచి జగన్ కు గిఫ్ట్‌ గా ఇస్తానని ప్రకటించారు ఏపీ మంత్రి జోగి రమేష్. కృష్ణా జిల్లా వైఎస్సార్ తాడిగడప మునిసిపాలిటీ పరిధిలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు మంత్రి జోగి రమేష్. ఈ సందర్భంగా ఏపీ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ…ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ నిర్వహించామన్నారు.

టిడిపికి పెనమలూరు లో అభ్యర్థులు కరువయ్యారని వెల్లడించారు. చంద్రబాబు IVRS ద్వారా సర్వేలు చేయిస్తున్నాడని..చంద్రబాబుపై పోటీ చేయడానికి పెనమలూరు వచ్చానని వివరించారు.పెనమలూరులో బంపర్ మెజారిటీతో గెలిచి జగన్ కి బహుమతిగా ఇస్తానని ప్రకటన చేశారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎప్పుడు గెలిపించాలా అని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు ఏపీ మంత్రి జోగి రమేష్.

Read more RELATED
Recommended to you

Latest news