లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 370కి పైగా సీట్లు గెలుస్తుంది – కిషన్ రెడ్డి

-

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 370కి పైగా సీట్లు గెలుస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. అభివృద్ధి భారతానికి మోడీ గ్యారంటీ పోస్టర్‌ ఆవిష్కరించారు కిషన్‌ రెడ్డి. ఈ సందర్బంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ… లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీ 370కి పైగా సీట్లు గెలుస్తుంది… తెలంగాణలో మెజార్టీ సీట్లు సాధిస్తామన్నారు. తెలంగాణలో మెజార్టీ సీట్లు సాధించేందుకు విజయ సంకల్ప యాత్రలు చేస్తున్నట్లు వివరించారు. యాత్రలకు మంచి స్పందన వస్తోందని తెలిపారు.

గత 10 సంవత్సరాలు గా మోడీ చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు, తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు యాత్రల ద్వారా ప్రజల ముందు పెట్టామన్నారు. అభివృద్ది చెందిన భారత్ కోసం మేనిఫెస్టో తయారీకి ప్రజల నుంచి సలహాలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దేశంలో ఇంకా పేదరికం ఉంది, మౌలిక వసతులు, విద్యా, వైద్యము లేదన్నారు. 2047లో దేశం అభివృద్ది చెందిన దేశంగా ఉండాలనేది బీజేపీ సంకల్పమని…GYAN ఎజెండా గా ముందుకు వెళ్తామని వెల్లడించారు. గరిబ్ కళ్యాణ్(G) యూత్ (Y) అగ్రికల్చర్(A) నారి శక్తి(N) అని.. రెండు రకాల మేనిఫెస్టో లు… ఒకటి 5 సంవత్సరాల కోసం… రెండోది 25 సంవత్సరాల కోసమన్నారు కిషన్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news