కె.ఆర్ సూర్యనారాయణకు ఏపీ హైకోర్టులో ఊరట

-

అమరావతి: కే.ఆర్ సూర్య నారాయణకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ముందస్తు బెయిల్ పిటిషన్ ని ఏసీబీ కోర్టులో దాఖలు చేయటానికి అనుమతి ఇచ్చింది హైకోర్టు. జూలై 7వ తేదీ లోపుగా విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. జూలై 7 వరకు సూర్య నారాయణపై తదుపరి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అలాగే కేఆర్ ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలు రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఏపీ వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నారు కేఆర్ సూర్యనారాయణ. ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖలో ఆయన ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించారని ఆరోపణలతో గత నెల 31న పటమట పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news