చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేస్తే.. పవన్ బిజెపిలో విలీనం చేస్తాడు – కేఏ పాల్‌

-

చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేస్తే.. పవన్ బిజెపిలో విలీనం చేస్తాడంటూ సెటైర్లు పేల్చారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌. సీఎం కె.సి.ఆర్ గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయకపోతే నిరాహారదీక్ష చేస్తానని ప్రకటించారు కేఏ పాల్‌. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని తెలంగాణ హైకోర్టులో పిల్ వేస్తానని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ మందు తాగి వచ్చాడో, డ్రగ్స్ కొట్టి వచ్చాడో ఏదేదో వాగాడని చురకలు అంటించారు.

పవన్ కళ్యాణ్‌ ప్యాకేజీ స్టార్… సిగ్గు, బుద్ధి లేదా పవన్ కి… మాయావతి కాళ్ళు పట్టాడంటూ ఫైర్‌ అయ్యారు. పవన్, చిరంజీవి పిచ్చి కూతలు కూస్తే ఊరుకోను.. పవన్, చిరంజీవి లపై సీబీఐ ఎంక్వైరీ వేయిస్తానని వార్నింగ్‌ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ ని అమ్మడం జరగదని తేగలవా పవన్…అని సవాల్‌ విసిరారు. పవన్ కి మాట్లాడటం రాదు, ఇంగ్లీషు రాదు అని అమిత్ షా నాకు చెప్పాడంటూ ఎద్దేవా చేశారు. ఏపీ మీద ప్రేమ లేని వాడు జనసేనలో చేరతాడు..బుద్ధి బుర్ర లేకుండా మాజీమంత్రి ఎవరో జనసేనలో చేరిందట అంటూ మండిపడ్డారు. చిటికేస్తే జగన్ ను, వైసిపి ఎమ్మెల్యేలను జైలులో పెట్టిస్తాననడానికి పవన్ ఎవరు….పిచ్చి కూతలు కూస్తే ఊరుకోనని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version