బాబు మోహన్ లాగా.. ప్రజాశాంతి పార్టీలో ముద్రగడ చేరాలి – KA Paul

-

KA పాల్ సంచలన ప్రకటన చేసారు. బాబూమోహన్‌ దారిలో ముద్రగడ పద్మనాభం నడవాలని కోరారు. అవినీతి పార్టీ అయిన వైసీపీలో చేరడం కంటే ప్రజాశాంతి పార్టీలోకి రావడం మంచిదన్నారు KA పాల్. అవినీతి లో కూరుకు పోయిన వైస్సార్సీపీ కంటే ప్రజా శాంతి పార్టీ బెటర్ అన్నారు.

త్వరలో బాబు మోహన్ ముద్రగడ ఇంటికి వెళ్తారు…ప్రజా శాంతి పార్టీ లోకి ఆహ్వానం ఇస్తారని చెప్పారు KA పాల్. అటు ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించనుంది వైసీపీ బృందం. ప్రస్తుతానికి షరతులు లేకుండానే వైసీపీలోకి ముద్రగడ వెళ్లనున్నారట. అవకాశం, అవసరాన్ని బట్టి పిఠాపురం స్థానం పరిశీలించే యోచనలో అధికార పార్టీ ఉంది. అలాగే..ముద్రగడ కుమారుడికి నామినేటెడ్ పదవి హామీ ఇచ్చిందట వైసీపీ. ఇక వచ్చే వారంలో సీఎం జగన్‌ సమక్షంలో పార్టీలో ముద్రగడ పద్మనాభం కుటుంబం చేరనుందట.

Read more RELATED
Recommended to you

Latest news