అంబటిపై గెలిచి..చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తా – కన్నా సంచలనం

-

అంబటి రాంబాబుపై గెలిచి..చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తానని కన్నా లక్ష్మీ నారాయణ సంచలన ప్రకటన చేశాడు. అధికార పార్టీలో మంత్రిగా ఉన్న అంబటి కంటే వస్తాదు ఎవరున్నారు… 1989లో అంబటి, నేను ఒకేసారి ఎమ్మెల్యే అయ్యాం..తేడా ఏముంది అని ప్రశ్నించారు. నియోజక వర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని.. స్థానిక డిఎస్పీ అంబటి గుమస్తా మాదిరి వ్యవహరిస్తూ టీడీపీ వారిని ఇబ్బంది పెడుతున్నాడని ఫైర్‌ అయ్యారు.

డిఎస్పీ తీర్పుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని.. స్పందన లేకపోతే సత్తెనపల్లి లేదా నరసరావు పేటలో ధర్నా చేస్తానని స్పష్టం చేశారు. టీడీపీ అధిష్టానం నాకు టికెట్ ఇస్తే గెలిచి చంద్రబాబుకి రిజర్న్ గిఫ్ట్ గా ఇస్తానని.. నేను సత్తెన పల్లి నుంచి పోటీ చేయటానికి ఒక కారణం ఉందని వెల్లడించారు. ఎన్నికలు డిక్లేర్ అయ్యాక కారణం వెల్లడిస్తానని వివరించారు. సత్తెనపల్లి నాకు కొత్తేం కాదని.. గతంలో నేను ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేసిన పెద కూరపాడు నియోజక వర్గంలో సగభాగమే సత్తెనపల్లి అన్నారు. పెదకూరపాడును అభివృద్ది చేసినట్టే సత్తెనపల్లిను అభివృద్ది చేస్తా అనేది నమ్మాలని సత్తెనపల్లి వారిని కోరుతున్నానని చెప్పారు కన్నా.

Read more RELATED
Recommended to you

Latest news