ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు చంద్రబాబు!

-

తాము అప్పటికే పనులు చేసి ఉంటాం… కానీ అవే పనులు చేయాలని డిమాండ్ చేస్తూ చంద్రబాబు లేఖలు రాస్తారు.. 2 రోజులు తర్వాత ఆయన డిమాండ్ కే మేం స్పందించినట్టు ప్రచారం చేసుకుంటారు… ఇంతకు మించిన నిస్సిగ్గు చర్య మరొకటి ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు ఏపీ మంత్రి కన్నబాబు! తాజాగా మీడియా ముందుకు వచ్చిన కన్న బాబు… చంద్రబాబు చేస్తున్న నీచ రాజకీయాలపైన స్పందించాలన్ని నిర్ణయించారంట. ఈ సందర్భంగా మాట్లాడిన కన్నబాబు…. ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ను అడ్డుకోవడం కంటే ఎల్లో వైరస్ ను అడ్డుకోవడం కష్టంగా ఉందంటున్నారు.

ఎందుకంటే… కరోనా వైరస్ లక్షణాలు స్పష్టంగా తెలుసుకోగలుగుతున్నాం కానీ, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమింపజేస్తున్న ఎల్లో వైరస్ లక్షణాలు మాత్రం కనిబెట్టడం కష్టంగా ఉందంటూ చంద్రబాబుపై సెటైర్లు వేశారు. గుజరాత్ నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి మత్స్యకారుల్ని తీసుకొస్తే, మా వల్లే ఇదంతా జరిగిందని ప్రచారం చేసుకుంటారు చంద్రబాబు. తమిళనాడు సీఎంతో మాట్లాడితే ఈయన మధ్యలో ఉత్తరం రాశారంటారు. సీఎం చేస్తున్నదంతా పక్కకు పోతోంది. మధ్యలో అంతా తనే దగ్గరుండి చేస్తున్నట్టు చెబుతున్నాడూ చంద్రబాబు… ఈ కొత్త తలపోట్లు ఏమిటో అర్ధం కాని పరిస్థితి!

ఇక ఈ సందర్భంగా వైఎస్ఆర్ రైతుభరోసా పథకం గురించి ప్రస్థావించిన మంత్రి…. మే 15 నుంచి ఆ పథకాన్ని అమలు చేయబోతున్నామని.. అయితే… 4 లక్షల లబ్దిదారుల్ని తొలిగించామని ఆరోపిస్తున్న బాబు వ్యవహారం ఎలా ఉందంటే… ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు చంద్రబాబు అన్నట్టుందని ఎద్దేవా చేశారు. లాస్ట్ టైమ్ 46లక్షల 50వేల మంది లబ్దిదారుల్ని గుర్తించి సహాయం చేశామన్న సంగతి తెలిపిన మంత్రి ఇప్పుడు అదనంగా మరికొంతమంది లబ్దిదారుల్ని గుర్తించే ప్రయత్నంలో ఉన్నామని, ఇంతలోనే 4 లక్షల మంది తొలిగించామని చంద్రబాబు ఎలా చెబుతారు అని ప్రశ్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news