అనుమతి తీసుకుని.. పోలవరంలో ఎవరైనా పర్యటించవచ్చు – మంత్రి కారుమూరి

-

అనుమతి తీసుకుని.. పోలవరంలో ఎవరైనా పర్యటించవచ్చని తెలిపారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. భీమవరంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. అనుమతి తీసుకుని పోలవరంలో ఎవరైనా పర్యటించవచ్చు..పద్దతి లేకుండా, తోకలేని కోతుల్లా ప్రాజెక్టులోకి వెళ్తామంటే ఉపేక్షించబోమని వార్నింగ్‌ ఇచ్చారు.

పోలవరాన్ని చంద్రబాబు ఏటిఎంగా వాడుకున్నారని ప్రధాని చెప్పారు..పోలవరాన్ని వచ్చే మార్చినాటికి పూర్తిచేసి సియం జగన్ చేతుల మీదుగా తాగు,సాగు నీరందిస్తామని ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తిచేస్తున్న ఘనత సియం జగన్ కే దక్కుతుందని.. రైతులు బాగుంటే రాష్ట్రం, దేశం బాగుంటుందని నమ్మిన వ్యక్తి సీయం జగన్ అని కొనియాడారు. దళారీ వ్యవస్థలేకుండా రైతులు పండించిన పంటలో ప్రతి గింజకొనుగోలు చేస్తున్నామని… రైతులకు బకాయిలు పెట్టి వెళ్ళిపోయిన ఘనత చంద్రబాబుదన్నారు. బియ్యంలో రాళ్ళు ఏరుతున్నట్టు టిడిపి నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.

Read more RELATED
Recommended to you

Latest news