చాలా కాలం తర్వాత చంద్రబాబుపై కేశినేని నాని ప్రశంసలు

-

చాలా కాలం తర్వాత జిల్లా పార్టీ నేతలతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని నాని…చంద్రబాబుపై ప్రసంశలు కురిపించారు. అగ్ని కుల క్షత్రియుల భవన నిర్మాణానికి ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ. 65 లక్షలు కేటాయించిన కేశినేని నాని… అభివృద్ధి, పరిపాలన విషయంలో చంద్రబాబు తీరును ప్రశంసించారు. కొంత కాలంగా పార్టీపై కేశినేని నాని గుర్రుగా ఉన్నారనే ప్రచారంతో ఆసక్తిని రేకెత్తించాయి కేశినేని నాని వ్యాఖ్యలు.

కొన్ని విషయాల్లో గద్దె రామ్మోహనుకు నేను ఏకలవ్య శిష్యుడని..కొంత మంది వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని పేర్కొన్నారు కేశినేని నాని. సమాజానికి ఉపయోగపడే పనులు చేయడంలో గద్దె ముందు వరుసలో ఉంటారు..అగ్నికుల క్షత్రియుల భవనం విషయంలో గద్దె రామ్మోహన్ కృషి ఉందన్నారు. యాంటీ వేవ్ లో కూడా గద్దె గెలిచారు… నా ఎంపీ ల్యాడ్స్ అంతా గద్దె రామ్మోహనుకే ఇస్తానని చెప్పాను… కొంత మంది చెడ్డ నేతలుుంటారని చెప్పారు.

విజయవాడ పశ్చిమ సెగ్మెంటులో నగరాల సామాజిక వర్గం వాళ్లు కమ్యూనిటీ హాల్ లేదని అన్నారు… అవసరమైన నిధులు ఇస్తానంటే.. తానే రూ. 4 కోట్లు ఇస్తానని వెలంపల్లి హామీ ఇచ్చారని వెల్లడించారు. ఆ పని ఇప్పటి వరకు నెరవేర లేదు.ఇప్పుడైనా తాను నిధులిస్తానంటే.. మళ్లీ రూ. 4 కోట్లు ఇస్తానంటూ వెలంపల్లి హామీ ఇచ్చారని తెలిపారు కేశినేని నాని. జగనుకు ఎందుకి ఛాన్స్ ఇచ్చారో కానీ.. నష్టపోయింది పేద ప్రజలే. ఎకానమీ దెబ్బ తినడం వల్ల పేదలే నష్టపోయారని విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version