బెజవాడ అభివృద్ధి కోసం ముళ్ళ పందితోనైనా కలుస్తా – కేశినేని నాని

-

టీడీపీ ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోసం గొంగళి పురుగును ముద్దాడుతా అని కేసిఆర్ అన్నారు నేను బెజవాడ పార్లమెంట్ అభివృద్ధి కోసం ముళ్ళ పందితో అయినా కలుస్తానంటూ ఓ రేంజ్‌ లో రెచ్చిపోయారు నాని. ఎంపీ టికెట్ లేకపోతే కేశినేని భవన్ లో కూర్చొని బెజవాడ ప్రజలకు సేవ చేస్తానని టీడీపీ ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు.

రాజకీయాల్లో నేను నా కుటుంబం జీవితాంతం ఉండాలని భావించే వ్యక్తిని కాదని.. మంచి పనులు ఎవరు చేస్తే వాళ్ళని నేను అభినందిస్తానని పేర్కొన్నారు. వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ నాలుగేళ్లుగా నాకు తెలుసు… వాళ్ళు మంచి చేస్తున్నారు కాబట్టి ప్రశంసించానని వివరించారు. నాకు తెలిసి మొండి తోక బ్రదర్స్ మంచి వాళ్ళు అని.. ఇసుక లో వాటాలు, మైనింగ్ లో వాటాలు ఇవ్వకపోతే ధర్నా బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు నేను చేయనని వెల్లడించారు. బెజవాడ పార్లమెంట్ కు ఎవరు మంచి చేస్తే వాళ్ళతో కలుస్తాను… ఎంపీగా ఉన్న నేను పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి చేయాలంటే అధికారులు, స్థానిక ఎమ్మెల్యే లు సహకరించాలని కోరారు. వైసీపీ లో ఉన్నప్పటికీ ఎమ్మెల్యే లు ఉదయ భాను , మొండి తోక సమన్వయము చేసుకోవటం వల్ల ఎంపీ ల్యాండ్ నిధులు ఇచి పనులు చేస్తున్నానని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news