చంద్రబాబు అరెస్ట్‌.. మోడీ, అమిత్‌ షాలకు కేశినేని నాని లేఖ

-

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ అంశంపై.. మోడీ, అమిత్‌ షాలకు కేశినేని నాని లేఖలు రాశారు. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని కేంద్రానికి కేశినేని నాని లేఖలు రాశారు. ఈ మేరకు రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రికి విడివిడిగా కేశినేని నాని లేఖలు రాశారు. ప్రజాస్వామ్యాన్ని, న్యాయాన్ని రక్షించాలని కోరారు.

చంద్రబాబుపై రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేదని ఈ లేఖలో వివరించారు కేశినేని నాని. ఆధారాల్లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారని… రాజకీయ కక్షతో ఈ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని ఆగ్రహించారు. ప్రజల్లో ఏపీ పోలీసులపై నమ్మకం పోయిందని.. అక్రమంగా జరిగిన చంద్రబాబు అరెస్ట్ వ్యవహరంలో కేంద్రం జోక్యం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కేశినేని నాని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news