లోకేష్ కు జగన్ బిగ్ షాక్… మంగళగిరి నాయకులు గంజి చిరంజీవికి కీలక పదవి.. !

-

నారా లోకేష్ కు సీఎం జగన్ బిగ్ షాక్ ఇచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గానికి చెందిన గంజి చిరంజీవికి వైసిపి కీలక బాధ్యతలు అప్పగించింది. వైసీపీ అధినేత వైయస్ జగన్ ఆదేశాల మేరకు ఆయనను రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ప్రకటన విడుదల చేసింది. టిడిపి నుంచి వైసీపీలో చేరిన కొద్ది రోజులకే చిరంజీవికి ఈ ప్రమోషన్ దక్కింది.

కాగా ఇటీవల గంజి చిరంజీవి టిడిపి పార్టీకి రాజీనామా చేసి వైసిపి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కండువా కప్పి గంజి చిరంజీవిని వైసీపీలోకి ఆహ్వానించారు. వైసీపీలో చేరడం ఆనందంగా ఉందని పార్టీ ఏ పని అప్పగించిన తాను చేస్తానని ఆ సందర్భంగా చిరంజీవి ప్రకటించారు. తనను ఇలా వినియోగించుకున్న అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు గంజి చిరంజీవి.

Read more RELATED
Recommended to you

Exit mobile version