ఏపీ రాజధాని ‘అమరావతి’నే..మాట మార్చిన కిషన్‌ రెడ్డి

-

ఏపీ రాజధాని ‘అమరావతి’నే అంటూ మరోసారి మాట మార్చారు కిషన్‌ రెడ్డి. నిన్న పాత్రికేయ సమావేశంలో నేడు మాట్లాడుతూ, రోజు రోజుకూ అనేక రంగాలలో అభివృద్ధి సాధిస్తూ వస్తున్నటువంటి విశాఖపట్టణం వంటి జిల్లా కేంద్రంలో మాధవ్ లాంటి వ్యక్తిని మనం ఎమ్మెల్సీగా గెలిపించుకున్నట్లయితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పడం జరిగిందని వివరించారు.

ఇలా మాట్లాడుతూ ఉన్న సమయంలో మాట్లాడిన విశాఖపట్టణం రాజధాని మాట, జిల్లా కేంద్రమైన విశాఖపట్టణాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడిన మాటే కానీ, రాష్ట్ర రాజధాని విశాఖపట్టణం అన్నది నా ఉద్దేశ్యం ఎంతమాత్రం కాదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ‘అమరావతి’ అని మా పార్టీ ఇదివరకే చాలా స్పష్టతనిచ్చింది. మేము, మా పార్టీ నాయకులంతా కూడా ఇదే మాటకు కట్టుబడి ఉన్నామన్నారు కిషన్ రెడ్డి. కాగా నిన్న విశాఖ పట్నం రాజధానికి అనువైన ప్రదేశం అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version