ఈ నెల 17న కలెక్టరేట్ ముట్టడిస్తాం – కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

-

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బిగ్ షాక్ ఇచ్చారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌షాకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ చేయడంపై విచారణ జరపాలని లేఖ రాశారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.

 

వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించారని ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. కొమ్మరపూడి లిఫ్ట్ ఇరిగేషన్ సమస్య అలానే ఉంది…. 10 కోట్ల నిధులు విడుదల చేసారు…సగం పనులు కూడా జరగలేదు, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు చేయలేదని మండిపడ్డారు.

ఈ నెల 17న ఉదయం 11 గంటలకి జిల్లా కలెక్టరేట్ వద్ద ముస్లిం సోదరులతో కలిసి నిరసన ధర్నా చేపడుతాం.. 25వ తేదీన ఆర్అండ్ బి కార్యాలయం వద్ద రోడ్ల కోసం ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ లోపే నిధులు విడుదల చేస్తే మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి, అధికారులకి ధన్యవాదాలు తెలియజేస్తాం.. ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఆలోచిస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news